Posts

Image
 అక్షరాల ఆవిర్భావం… కవితలు రాద్దామనుకున్నా — కాగితం ఎదురు చూసింది, కలం చేతివ్రేళ్లలోకి దూరింది, మనసు మాటలను కుమ్మరించింది। కవితలు వినిపిద్దామనుకున్నా — గుండె గర్భంలో గుసగుసలు మోగాయి, గొంతు తలుపులు తెరుచుకున్నాయి, నిశ్శబ్దమే నాదమై శ్రావ్యతను చిందించింది। తేటపలుకుల తేనెచుక్కలు చల్లుదామనుకున్నా — పదాలు పరిమళాలై పూచాయి, పలుకులు పూలవానై కురిశాయి, పంక్తులు మాధుర్యమై ముందుకొచ్చాయి। కవనాలను ప్రచార మాధ్యమాలకు పంపుదామనుకున్నా — ఆలోచనలు రెక్కలు తొడుక్కొన్నాయి, అక్షరాలు ఆకాశానికి ఎగిరాయి, లోకాన్నంతా పలకరించి పులకరింపజేశాయి। కమ్మగా పాడుదామనుకున్నా — రాగాలు చిరుజల్లులై జారాయి, భావాలు గానస్వరాలై మారాయి, మనసులను మత్తెక్కించాయి। పాఠక హృదయాలను తట్టాలనుకున్నా — అక్షరం ఒక్కటే చాలు అనిపించింది, ఆత్మను తాకే పలుకు, అమృతంలా జారిపడింది। కవితలు అనేవి — కలం రాసిన గీతలు కావు, మనసుల్ని ముట్టే మాధుర్యాలు, లోకాన్ని ఓలలాడించే గాంధర్వ గానాలు॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదిక ద్వితీయ వార్షికోత్సవ సమావేశం నేడు 12-04-26వ తేదీ ఆదివారం రవీంద్ర భారతిలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సినీటీవి గేయ రచయిత డాక్టర్ మౌనశ్రీ మల్లిక్ అధ్యక్షతన జరిగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదిక ద్వితీయ వార్షికోత్సవం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. అనతి కాలంలోనే సాహిత్య సేవలో విశిష్టమైన కార్యక్రమాలను నిర్వహించినందుకు నిర్వాహకులకు అభివందనలు తెలిపారు. ముఖ్య అతిధి మరియు సంచాలకులు తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొని, అద్భుతమైన కవితలు వినిపించినందుకు సాహితీ ప్రియులకు శుభాకాంక్షలు తెలిపారు. చక్కని మూడు పుస్తకాలు సమావేశంలో అవిష్కరించినందుకు సంతోషం వ్యక్తపరిచారు. డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు కవి మరియు విశ్రాంత బ్యాంకు అధికారి శ్రీ రాజేంద్రప్రసాద్ రచించిన అక్షర సౌరభాలు పుస్తకాన్ని, శ్రీమతి పొన్నాల ధనమ్మ వ్రాసిన గాయాలు నేర్పిన కావ్యాలు పుస్తకాన్ని విశ్రాంత అటవీ శాఖ అధికారి అంబటి లింగ క్రిష్ణారెద్ది గారు, బాల బంధు. కవి శ్రీ గద్వాల సోమన్న వ్రాసిన 94వ...
Image
 సరిలేరు నీకెవ్వరూ కవిరాజా! సరిలేరు నీకెవ్వరూ కవిరాజా! — స్వరాల సిరుల్లో సత్యం ముంచెత్తే సాగరమువి నీవే, నిత్యమూ నవరసాల్లో నాట్యమాడించే నర్తకుడివి నీవే, నిశ్శబ్దానికే నాదం నేర్పించే నాదబ్రహ్మవి నీవే। ఆలోచనల్లో ఆకాశమై విహరిస్తూ — అనంతాన్ని అక్షరాల్లో ఆవిష్కరించే వింతవాడివి, గుండె చప్పుడు గీతమై పలికే ప్రతి క్షణం కాలానికి కవిత్వం నేర్పే కర్తవి నీవే। అక్షరాల్లో అమృతం చిందిస్తూ — అంతరంగాలను ఆనందసాగరంలో ముంచెత్తేది నీవే, పదాల్లో పానకపాయసాల విందు పెడుతూ — పాఠకుల్లో పూటపూటా పరవశం పొంగించేది నీవే। పలుకుల్లో తేనెచుక్కలు జారుస్తూ — పగలు పసిడి వేళలా మురిపించేది నీవే, మాటల మాధుర్యం అందిస్తూ — మనసులను మల్లెల మాలల్లా పరిమళింపజేసేది నీవే। సాహితీవనంలో పువ్వులు పూయిస్తూ — సృజన సుగంధం గాలిలో నర్తింపజేస్తూ, కవితల్లో కాంతులు వెదజల్లుతూ — చీకటిలో కూడా చిరునవ్వులు చిందించేది నీవే। భావాల్లో రవికాంచని చోటుకూ చేరుతూ — భువనానికతీతంగా విరజిమ్మే వెలుగువి నీవే, పరిసరాల్లో సుమసౌరభాలు ప్రసరిస్తూ — ప్రపంచాన్నే పదప్రయోగాలతో పరవశపరచేది నీవే। కలం నీ చేతిలో కలగలిసిన మాయదండమై — కాలాన్ని కట్టిపడేసే కవితలు రాస్తుంటే, నీ ప...
Image
 కవిత అంటే… కవితంటే మాటల మురిపెంగా మనసును మెల్లగా మెప్పించాలి — మల్లెపూల పరిమళంలా మాటల మధ్య మాధుర్యం జార్పించాలి। కవితంటే మెరుపుల జిలుగుగా అక్షరాల్లో ఆలోచనలు మెరిపించాలి — ఒక్క పదమే పిడుగైపోయి నిద్రలోనూ చైతన్యం నింపేలాగుండాలి। కవితంటే మత్తును దూరం చేసే మధురమైన జ్ఞాపకాల మందు కావాలి — చీకటిలో చతికిలపడక దారిచూపే దీపమై నిలవాలి। కవితంటే మాధుర్య గానం మనసు గూటిలో గూడు కట్టాలి — చల్లని గాలిలా చేరి చింతలను మెల్లగా దూరం చేయాలి। కవితంటే హృదయాన్ని తట్టాలి మనిషి మనసును మెలిపెట్టాలి — నిశ్శబ్దంలో మాటలై నిజాలను నిద్రలేపాలి। కవితంటే మానవత్వ దర్పణం మనుగడకు మార్గం చూపాలి — కన్నీటి బొట్టులోనూ కరుణ వెలుగులు నింపాలి। కవితంటే కేవలం పదాలు కాదు — ప్రాణం పొసిన భావాల ప్రపంచం మనసు నుంచి మనసుకు చేరే మానవత్వపు మధుర సందేశం। గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 నీలో ఏముంది…? (నీలోని నీవు) నీలో ఏముంది — ఉత్సాహపు ఉరుములా ఉప్పొంగే శక్తినా? లేదా నిరాశ మబ్బులా కమ్ముకునే మౌనమా? నీలో ఏముంది — భయపు చీకటిలో వణికే నీడలా? లేదా ధైర్య దీపంలా వెలిగే వెలుగా? నీలో ఏముంది — ప్రేమ అనే పుష్పవనం పరిమళమా? లేదా కోపాగ్నిలా కాల్చే జ్వాలలా? నీలో ఏముంది — ఆశల ఆకాశంలో ఎగిరే కలల పక్షులా? లేదా నిస్సహాయంగా కూలిన రెక్కల వేదనలా? నీలో ఏముంది — నిన్ను నువ్వు తెలుసుకునే ప్రశ్నలా? లేదా సమాధానం కోసం వెతికే ప్రయాణమా? నీలో అన్నీ ఉన్నాయి — అవి నీలోనే పుడతాయి — నీ ఆలోచనల విత్తనాల నుంచి, నీ అనుభవాల నేలలో పెరుగుతాయి। నీ నిర్ణయమే మార్గం — ఏది పెంచాలో, ఏది తగ్గించాలో, ఏది వెలుగులోకి తెచ్చాలో, ఏది చీకటిలోనే ఉంచాలో… నీలోని ప్రపంచం —  నీ చేతుల్లోనే ఉంటుంది, నీవు ఎంచుకున్న భావమే నీ జీవితాన్ని రంగులతో నింపుతుంది… గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 నా కవనజీవితంలో… నాకు ప్రేమ కావాలి — అంతరంగాన్ని అలరించటమే కాదు అనురాగాలు ఆప్యాయతలు అందించే ఆత్మబంధువుల అమృతబంధం కావాలి। నాకు ఖుషీ కావాలి — గాలిలో చిందే చిరునవ్వులే కాదు గుండెల్లో నర్తించే సంతోషంలా కాలాన్ని పండుగగా మార్చే మాధుర్యం కావాలి। నాకు కూడు కావాలి — కడుపుని నింపే అన్నం మాత్రమే కాదు అమ్మ చేతి వంటలోని ఆప్యాయత తండ్రి చెమటలోని పరిమళ ముద్దలు కావాలి। నాకు గూడు కావాలి — గోడల మధ్య కట్టిన ఇల్లు కాదు మనసులు ముడిపడిన ఆశ్రయం భయాన్ని తుడిచే స్నేహపు నీడ కావాలి। నాకు అందం కావాలి —  కన్నులకే కనిపించే రూపం కాదు మనుషుల్లో మెరుస్తున్న మంచితనం పూయాలి  స్వార్థం కరగాలి సౌందర్యం వికసించాలి। నాకు కవిత్వం కావాలి —  అక్షరాల ఆట కాదు ఆత్మలో పుట్టే స్పందన  అనుభూతుల గర్భంలో వికసించే భావం కాలాన్ని దాటే సత్యాల స్వరం కావాలి నిశ్శబ్దానికీ నాదం ఇచ్చే నిత్యజ్యోతి కావాలి. ఇవన్నీ కలిసినపుడే —  జీవితం పరిపూర్ణమవుతుంది…ప్రేమలో పుష్పిస్తుంది… ఖుషీలో నవ్వుతుంది…కూడు-గూడు మధ్య నిలబడుతుంది… అందంలో మెరిసిపోతుంది… కవిత్వంగా కాలానికీ చిరునవ్వై నిలిచిపోతుంది… గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం...
Image
 కలాల గళాలు కలాలు కదులుతున్నాయి — కాలపు గుండెలో కొట్టుకునే స్పందనల్లా  నిశ్శబ్దానికి నడక నేర్పే నిజాల అడుగుల్లా ముందుకూ మున్ముందుకూ। కలాలు కారుస్తున్నాయి — మనసులో మిగిలిన మధుర వేదనలను మాటల్లో మలచి జార్చే మంచి ముత్యాల్లా మిలమిలా తళతళా। కలాలు చెక్కుతున్నాయి — అనుభవాల రాతిబండలపై అక్షరాల శిల్పాల్ని మలిచి జీవితాల్ని జ్ఞాపకంగా తియ్యగా తిన్నగా। కలాలు గీస్తున్నాయి — కలల కాన్వాసులపై ఆలోచనల రంగులతో అందమైన లోకాలను భావాల్లా బొమ్మల్లా। కలాలు కోరుతున్నాయి — సత్యం కోసం, సమానత్వం కోసం మౌన గుండెల స్వరాన్ని వినిపించేందుకు న్యాయాన్ని నిలబెట్టేందుకు నీతినీ నిజాయితీనీ। కలాలు కక్కుతున్నాయి — అన్యాయం మీద ఆగ్రహాన్ని అసత్యంపై ఆవేశాన్ని అక్షరాగ్నిలా రవ్వలు చెరుగుతూ చిమ్ముతూ। కలాలు… మేధావుల చేతిలో మహత్తర సాధనాలు — మనసు మాట్లాడే మాధ్యమాలు  మానవత్వం మేల్కొలిపే మహామంత్రాలు। కలాలు కమ్మని కవితలు కూర్చితే — కేవలం పదాలనే కాదు ప్రపంచాన్ని మార్చగలవు  హృదయాలను ఉప్పొంగించగలవు॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.