అంధ్రాక్షరాలకు అమృతాభిషేకం (అంధ్రాష్టదేవతల ఆరాధనం) ఓంకార నాదమున పుట్టిన తెలుగు తల్లి అక్షరాలు — మూడు ఖండాలై విరిసాయి, అష్ట వాగ్దేవతలై వెలిగాయి. యాబది ఆరు అక్షరాల ఆంధ్రం త్రికండ్రికల సమూహం, అ నుండి అః వరకు — చంద్ర ఖండం శీతల స్వరాల శృంగారం. క నుండి భ వరకు — సౌర ఖండం వ్యంజనాల తేజోమయ రాజ్యం, మ నుండి క్ష వరకు — అగ్ని ఖండం ఉచ్చారణ ఉష్ణత, అర్థాల అంగారకం. అచ్చుల ఆకాశంలో వాగ్దేవత వశని విహరించింది. ఉచ్చారణకు ఉయ్యాలలూపి, భావాలు, మాటలు మనసుకు వశం చేసింది. క వర్గానికి కామేశ్వరి ఆకర్షణ అంగరంగభోగం అద్దింది. చ వర్గానికి మోదిని మాధుర్య మంత్రాలు చల్లింది. ట వర్గానికి విమల శుద్ధ శబ్ద శిఖరాలు నిర్మించింది. త వర్గానికి అరుణ ఉషస్సుల వెలుగులతో తేజస్సు ఇచ్చింది. ప వర్గానికి జయని పలుకుల్లో పరాక్రమం నింపి, తెలుగును విజేతగా నిలిపింది. యరలవలకు సర్వేశ్వరి సమగ్ర శైలిని ప్రసాదించి, భాషను సమన్వయ శిల్పంగా మలిచింది. కడపటి అక్షరాలందు - కౌలిని అవతరించి, రహస్య రసాలను రగిలించి, అక్షరాలకు తంత్రతేజం చేకూర్చింది. చంద్ర ఖండం — మాధుర్యం, సౌర ఖండం — తేజస్సు, అగ్ని ఖండం — సృష్టి శక్తి, ఈ మూడు ఖం...