ప్రసన్నంకోసం పరంధాముడు ప్రసన్నం కావాలని — పూజా పునస్కారాలు చేస్తా, ప్రసాద తాంబూలాలు పంచుతా. ప్రియురాలు ప్రసన్నం కావాలని — పొంకపు చూపులు విసురుతా, పకపకల నవ్వులు చిందుతా. అధికారులు ప్రసన్నం కావాలని — దండాలు పెడతా, ధనమాశ చూపుతా; బహుమతులు ఇస్తా, బ్రతిమాలుకుంటా. ప్రకృతి ప్రసన్నం కావాలని — పలురీతుల పసందుగా వర్ణిస్తా, పరికింపజేసి పరవశపరుస్తా. పలుకులమ్మ ప్రసన్నం కావాలని — ప్రణామాలు చేస్తా, ప్రతినిత్యం ప్రార్థిస్తా. అక్షరాలు ప్రసన్నం కావాలని — వెదికివెదికి పట్టుకుంటా, ముత్యాల సరాల్లా కూరుస్తా. పదాలు ప్రసన్నం కావాలని — పువ్వుల్లా గుచ్చుతా, ప్రాసల్లో పొసుగుతా. పాఠకులు ప్రసన్నం కావాలని — తనువులు తట్టుతా, మనసులు ముట్టుతా. సాహిత్యలోకము ప్రసన్నం కావాలని — అక్షరజ్యోతుల్లో వెలుగుతా, పతకమాలలతో కులుకుతా. అంతరంగాలు ప్రసన్నం కావాలని — మాటల మల్లెలు విసురుతా, మదులను మత్తులో ముంచుతా. పొరుగువారు ప్రసన్నం కావాలని — పలుకులకు తేనియను పూస్తా, పెదాలకు అమృతం అందిస్తా. ప్రపంచము ప్రసన్నం కావాలని — కవితా గానము ఆలపిస్తా, అంతరంగ సాక్షిగా నిలుస్తా. ప్రసన్నమే నా రక్తి ప్రసన్నతే నా శక్తి ప్రసన్నమే నా యుక్తి ప్రసన్నతే న...
Popular posts from this blog
నేతలారా! ప్రజలంటే అమాయకులు కాదోయ్ చెప్పినవన్నీ నమ్మటానికి చెప్పినట్లు తలలూపటానికి ప్రజలంటే గొర్రెలు కాదోయ్ ఒకేదారిన నడవటానికి గుడ్డిగా ప్రవర్తించటానికి ప్రజలంటే అవినీతిపరులు కాదోయ్ డబ్బులు తీసుకోవటానికి ఓట్లు అమ్ముకోవటానికి ప్రజలంటే పశువులు కాదోయ్ గాటిన కట్టేయటానికి పనులు పురమాయించటానికి ప్రజలంటే పోకిరీలు కాదోయ్ గొడవలు చేయటానికి గోతుల్లో తోయటానికి ప్రజలంటే గాడిదలు కాదోయ్ దెబ్బలు తినటానికి బరువులు మోయటానికి ప్రజలంటే కుక్కలు కాదోయ్ కాపలా కాయటానికి గట్టిగా మొరగటానికి ప్రజలంటే తాగుబోతులు కాదోయ్ మధ్యానికి బానిసలుకావటానికి సారానిచ్చినవారిని గెలిపించటానికి ప్రజలంటే తిండిబోతులు కాదోయ్ బిర్యానిపొట్లాలకు లొంగటానికి బటన్లను నొక్కటానికి ప్రజలంటే మేధావులోయ్ ఆలోచించటానికి నిర్ణయాలుతీసుకోవటానికి ప్రజలంటే చైతన్యపరులోయ్ నిజాలనుచూడటానికి న్యాయంగామెలగటానికి ప్రజలంటే సంఘజీవులోయ్ కలసిబ్రతకటానికి పరస్పరంసహాయంచేసుకోవటానికి ప్రజలంటే ఓటరుమహాశయులోయ్ అభిమతంతెలియజేయటానికి అభివృద్ధికాముకులనెన్నుకోవటానికి ప్రజలంటే ప్రజాసామ్యవాదులోయ్ ప్రజలకొరకు ప్రజలచేత ప్రజలేపాలించే ప్రభుత్వాన్నికోరేవారోయ్ గుండ్లపల్లి రా...
ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదిక నాల్గవ సమావేశం నేడు 07-01-25వ తేదీ ఎ ఎస్ రావునగర్ హైదరాబాదులో ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిన నాల్గవ కాప్రా మల్కాజగిరి కవుల వేదిక నాల్గవ సమావేశం. సభకు అధ్యక్షత వహించిన సినీటీవి గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ గారు వేదిక మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నందని కొనియాడారు. ముఖ్య అతిధి నేటి నిజం దినపత్రిక సంపాదకుడు బైస దేవదాస్ గారు మాట్లాడుతూ ఎడారులలోనూ భూమినుండి నీరు పొంగి పొర్లటం చూచామని, అట్లే కవుల మనసులలోని భావాలు మంచి కవితలుగా ప్రవహించాలని, అనుభూతులను కవితలలో వ్యక్తపరచి కవులు అభివృద్ధిలోకి రావాలని కోరారు. విశిష్ట అతిధి ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి గారు మాట్లాడుతూ స్తాపించిన కొద్దికాలంలోనే కాప్రా మల్కాజగిరి కవుల వేదిక మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు, కవులకు మంచి ప్రోత్సాహిమిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ప్రముఖకవి నూతక్కి రాఘవేంద్రరావు గారు, కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు డాక్తర్ రాధాకుసుమ గారు, అక్షర కౌముది సమూహ వ్యవస్థాపక అధ్యక్షులు తులసి వెంకట రమణాచార్యులు గారు, నంది అవార్డు గ్రహీత సినీ నిర్మాత దర్శక...

Comments
Post a Comment