ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదిక నాల్గవ సమావేశం నేడు 07-01-25వ తేదీ ఎ ఎస్ రావునగర్ హైదరాబాదులో ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిన నాల్గవ కాప్రా మల్కాజగిరి కవుల వేదిక నాల్గవ సమావేశం. సభకు అధ్యక్షత వహించిన సినీటీవి గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ గారు వేదిక మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నందని కొనియాడారు. ముఖ్య అతిధి నేటి నిజం దినపత్రిక సంపాదకుడు బైస దేవదాస్ గారు మాట్లాడుతూ ఎడారులలోనూ భూమినుండి నీరు పొంగి పొర్లటం చూచామని, అట్లే కవుల మనసులలోని భావాలు మంచి కవితలుగా ప్రవహించాలని, అనుభూతులను కవితలలో వ్యక్తపరచి కవులు అభివృద్ధిలోకి రావాలని కోరారు. విశిష్ట అతిధి ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి గారు మాట్లాడుతూ స్తాపించిన కొద్దికాలంలోనే కాప్రా మల్కాజగిరి కవుల వేదిక మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు, కవులకు మంచి ప్రోత్సాహిమిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ప్రముఖకవి నూతక్కి రాఘవేంద్రరావు గారు, కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు డాక్తర్ రాధాకుసుమ గారు, అక్షర కౌముది సమూహ వ్యవస్థాపక అధ్యక్షులు తులసి వెంకట రమణాచార్యులు గారు, నంది అవార్డు గ్రహీత సినీ నిర్మాత దర్శక...
Popular posts from this blog
నైమిశంలో అద్భుతంగా జరిగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదిక వారి కార్తీక వనభోజనాల వేడుక నిన్న 15-11-2024వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భముగా జిడ్డు క్రిష్ణమూర్తి కేంద్రం నైమిశంలో కాప్రా మల్కాజగిరి కవుల వేదిక కార్తీక వనభోజనాల వేడుకను అద్భుతంగా నిర్వహించింది. మొదట కార్యక్రమ నిర్వాహకుడు శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు అందరికి స్వాగతం పలికారు. వేదిక మార్గదర్శకుడు మరియు సినీటీవి గేయ రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు కవుల వేదిక గురించి వివరించి అతిధులకు మరియు ఆహ్వానితులు బాగా స్పందించినందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రఖ్యాత మనస్తత్వవేత్త శ్రీ శ్రీక్రిష్ణ గారు మనిషి తనకు తనే మిత్రుడని, తనకు తనే శత్రువని చెబుతూ మనోవికాసానికి తీసుకొనవలసిన పద్ధతులను చక్కగా వివరించారు. ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి గారు తను వివిధ సంస్థలకు ఇచ్చిన మరియు ప్రఖ్యాతి పొందిన వ్యాపార ప్రచార ప్రకటనల గురించి వివరించారు. కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు శ్రీమతి రాధా కుసుమ గారు అంత్యాక్షరి పాటల కార్యక్రమాన్ని చాలా ఉత్సాహభరితంగా నిర్వహించారు. తెలుగువెలుగు ప్రధాన కార్యదర్శి శ్రీ మోటూరి నారాయణరావు గారు తంబోలా ఆ...
డాక్టర్ ఎ యస్ రావుకు 21వ వర్ధంతి సందర్భముగా ఘన నివాళులు 31-10-24వ తేదీ ఉదయం ఎ యస్ రావునగర్ లో డాక్టర్ ఎ యస్ రావునగర్ నివాసుల సంక్షేమ మరియు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఎ యస్ రావు గారి 21వ వర్ధంతి సందర్భంగా అతిధులు, ఐదుగురు కవులు మరియు వక్కృత్వపు పోటీలో గెలుపొందిన నలుగురు అణు విద్యుత్ పాఠశాల విద్యార్ధులు ఘన నివాళులు అర్పించారు. మొదట సంఘ నిర్వాహకుడు శ్రీ శంకరరావు గారు అతిధులను వేదికపైకి ఆహ్వానించారు.సభాధ్యక్షుడు శ్రీ బులుసు భాస్కరరావు గారు సంస్థ మరియు సంస్థ ఉద్యోగులు ఎ యస్ రావు గారికి ఎంతో ఋణపడి ఉన్నారన్నారు. ముఖ్య అతిధి శ్రీ వి కె ప్రేమచంద్ గారు శ్రీ రావు గారితో వారికున్న అనుబంధాన్ని 1930 వ దశకం నుండి 2000 వ దశకం వరకు సోదాహరంగా వివరించారు. శ్రీ రావు గారి ఆశయాలను భావాలను మహోన్నత వ్యక్తిత్వాన్ని తెలియపరిచారు. కాప్రా మల్కాజగిరి కవుల వేదిక తరఫున ఐదుగురు కవులు పాల్గొని శ్రీ రావు గారికి గేయార్చనచేశారు. డాక్టర్ రాధా కుసుమ గారు జోహారు జోహారు ఎ యస్ రావు గారు, ఓ కార్యసాధకుడా అంటు చక్కగా పాడారు. పిమ్మట డాక్టర్ దీపక్ న్యాతి గారు అదిగో అదిగో అదిగదిగో నింగిని వెలుగుతుంది ఓ చుక్కా...
Comments
Post a Comment